అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావేశాలు ఐదు రోజుల పాటు జరుగనున్నాయి.ఈ మేరకు ఏపీ అసెంబ్లీ బీఏసీ నిర్ణయించింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, బీఏసీ సభ్యులు పెద్దిరెడ్డి, జోగిరమేశ్, రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ విప్ ప్రసాదరావు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈనెల 21 వరకు జరిగే సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ముఖ్యంగా టీడీపీ డిమాండ్ చేస్తున్న 19 అంశాలను చర్చించేందుకు బీఏసీ అంగీకరించింది. సంక్షోభంలో వ్యవసాయం, ఆర్థిక రంగం, భారీ వర్షాలతో నష్టాలు, మద్యం కుంబకోణం, నిరుద్యోగం తదితర అంశాలను టీడీపీ ప్రస్తావించింది. కాగా ఇవాళ ఉదయం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభైనా సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. నిరుద్యోగ సమస్యపై వాయిదా తీర్మానంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. స్పీకర్ పోడియం వద్దకు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు.
జాబ్ ఎక్కడ జగన్ ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సరైంది కాదని, టీడీపీ సభ్యులు సభా సాంప్ర దాయాలు పాటించడం లేదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. టీడీపీ సభ్యుల ఆందోళన కారణంగా రెండుసార్లు సభను వాయిదావేసి తిరిగి ప్రారంభించారు.