అమరావతి : ఏపీలో వరుసగా ఆరురోజులు వందకుపైగా కేసులు నమోదుకాగా ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 74 కేసులు నమోదయ్యాయి. 61 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గుంటూర్, నెల్లూర్ జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,556కు చేరింది. 8,82,462 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 921 యాక్టివ్ కేసులున్నాయి. 7173 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 25,907 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 1,41,62,086 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.