అమరావతి : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు దివంగత నందమూరి తారకరామారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ ఇవ్వాలని టీడీపీ డిజిటల్ సంతకాల సేకరణను ప్రారంభించింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ డాట్ కాం అనే వెబ్సైట్ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు లాంఛనంగా ఆవిష్కరించారు.
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి డిజిటల్ సంతకాల సేకరణను ప్రారంభించారు. చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరిట అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయించి, ఏడాది పాడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎన్టీఆర్ రేపటి తరానికే కాదు తరతరాలు జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు.