Naima Khatoon | న్యూఢిల్లీ : అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) వైస్ చాన్స్లర్గా నైమా ఖాతూన్ నియమితులయ్యారు. వర్సిటీ 100 ఏండ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. ఆమె నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ అనుమతి కూడా తీసుకున్నట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఏఎంయూలో సైకాలజీలో పీహెచ్డీ అందుకున్న ఆమె, 5 ఏండ్లపాటు వర్సిటీ వీసీగా కొనసాగనున్నారు. 1875లో ఏర్పాటైన ముహమ్మదన్ ఆంగ్లో ఓరియెంటల్ కాలేజీ ..1920లో ‘అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ’గా మారింది.