న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదం తెలపకుండా పెండింగ్లో ఉంచడంపై సమధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ను కోరింది. రాజ్భవన్కు నోటీసులు జారీ చేసింది.
ఇదే తరహాలో గవర్నర్లు బిల్లులు పెండింగ్ పెట్టడంపై తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. న్యాయస్థానం ఆగ్రహించిన తర్వాతే తమిళనాడు గవర్నర్ కొన్ని బిల్లులను క్లియర్ చేశారు. 200 అధికరణ ప్రకారం వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాలని సుప్రీంకోర్టు గతేడాది ఏప్రిల్లో సూచించింది.