అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 24 పంటలకు మద్దతు ధర అందజేస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. దేశంలో అన్ని పంటలకు కనీస మద్దతు కల్పించేందుకు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని కోరినట్లు ఆయన చెప్పారు.
మహిళా రిజర్వేషన్, దిశ బిల్లు ఆమోదించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఆహార భద్రత చట్టంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు. అణగారిన బీసీల గుర్తింపునకు సామాజిక, ఆర్థిక కులగణన చేయాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున కోరామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.