అమరావతి : ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది . క్రికెట్లో బెట్టింగ్కు పాల్పడ్డ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. కోడూరు కొత్తబజార్కు చెందిన కార్తీక్ క్రికెట్ బుకీల వేధింపులకు గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి శవ పంచనామా నిర్వహిం చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య , ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.