కడ్తాల్, నవంబర్ 2: మహిళలు ఆర్థికంగా ఎదగడానికి స్వయం సహాయక సంఘాలు దోహదపడతాయని డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, జడ్పీటీసీ దశరథ్నాయక్, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో వారం రోజులుగా మండల మహిళా సమాఖ్య ఏపీఎం రాజేశ్వరీ ఆధ్వర్యంలో, మండలంలోని మహిళలకు పచ్చళ్ల తయారీపై శిక్షణ తరగతులు నిర్వహించారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామీణ అంకుర సంస్థల వ్యవస్థాపక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఆర్డీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేసిన పచ్చళ్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీటీసీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. మహిళ సమాఖ్య ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు.
మహిళ సమాఖ్య ద్వారా మహిళలు పచ్చళ్ల తయారీని చేపట్టడం అభినందనీయమని ఆయన అన్నారు. మండలంలోని మహిళలకు పచ్చళ్ల తయారీ విధానాన్ని కడ్తాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శిక్షణ తరగతులను నిర్వహించిన డీఆర్డీఏ అధికారులకు సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పచ్చళ్లు తయారు చేసిన మహిళలకు అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేసి, వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మండలాధ్యక్షుడు వీరయ్య, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్లు యాదయ్య, లోకేశ్నాయక్, భాగ్యమ్మ, ఏపీడీ జంగారెడ్డి, ఏపీఏంలు రాజేశ్వరి, వెంకట్రెడ్డి, మండల మహిళ సమాఖ్య అధ్యక్షురాలు జంగమ్మ, వార్డు సభ్యులు భిక్షపతి, దీపిక, జంగమ్మ, నాయకులు వెంకటేశ్, శ్రీను, సురేశ్, నాగార్జున్, సీసీలు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.