యాసంగిలో వరి పంట సాగుచేసే రైతులు నారుమడులు చల్లుకునే నాటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు నారుమడులను చల్లుకున్న నాటి నుంచే తగిన యాజమాన్య పద్ధతులను పాటించాలి. తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. వారి సూచనలను మనం పాటిస్తూ పంటలు పండించడం వల్ల మంచి లాభాలను అందిపుచ్చుకోవచ్చు.
నారుమడులు చల్లే విధానం
రైతులు నారు మడులను పెంచుకోవడం కోసం ఎకరాకు 25 కేజీల నుంచి 30 కేజీల వరకు విత్తనాలను చల్లుకోవాలి. నారుమడులను చల్లుకోవడం కంటే ముందుగా రైతులు వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కార్బండిజమ్ కలిపి 24 గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలి. అదే దుంప నారుమళ్లయితే లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజమ్ కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి తరువాత 24 గంటలు మండెకట్టి మొలకలను నారుమడులలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటరు మందునీరు చొప్పున 30 కిలోల విత్తనాలు నానబెట్టడానికి 30 కిలోల మందు ద్రావణాన్ని తయారుచేసుకోవాలి.
నారుమడులు పెంచేవిధానం