ఆరోగ్యపరంగానే కాదు.. రైతుకు ఆదాయం అందించడంలోనూ ‘కాకరకాయ’ ముందు వరుసలో ఉన్నది. సంప్రదాయ పంటలు నిరాశ పరుస్తున్న సమయంలో.. అన్నదాతకు అధిక లాభాలు తెచ్చి పెడుతున్నది. ముఖ్యంగా పందిరి కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా తోడైంది. ఈ క్రమంలో ఎక్కువ దిగుబడినిచ్చే రకాలు, స్థిరమైన మారెట్తో.. ‘కాకర సాగు’ లాభదాయకంగా మారింది.
పందిరి పద్ధతిలో సాగుచేసి అధిక లాభాలు అందించేవాటిలో ‘కాకర’ ముఖ్యమైనది. దాదాపు అన్ని రకాల నేలల్లోనూ పండుతుంది. ముఖ్యంగా చలికాలం (డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి) నెలల్లో కాకర సాగు చేయడం మంచిది. దీనివల్ల తెగుళ్ల తీవ్రత తక్కువగా ఉండి, నాణ్యమైన అధిక దిగుబడి వస్తుంది. నేల స్వభావం, నాటుకునే విధానాన్ని బట్టి దిగుబడి పెరుగుతుంది.
స్థానిక వాతావరణం, నేలలను బట్టి విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి. సూటి, హైబ్రిడ్ రకాలతో ఎక్కువ దిగుబడి వస్తుంది. కాకరలో కోయంబత్తూర్ లాంగ్, మహికో గ్రీన్ ల్యాండ్, గ్రీన్, ఆర్మ హరిత రకాలు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి.
ఎకరానికి 800 గ్రాముల నుంచి కిలో విత్తనాలు అవసరం అవుతాయి. విత్తడానికి ముందే కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున థైరమ్, 5 గ్రా.చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. దీనివల్ల విత్తనం ద్వారా సంక్రమించే పలు రకాల వైరస్, బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టవచ్చు. వేరుకుళ్లు సమస్య ఎక్కువగా ఉన్న నేలల్లో 100 గ్రా. విత్తనానికి 2 గ్రా.చొప్పున ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.
నేలను మూడు, నాలుగు సార్లు లోతు దుకులు చేసుకోవాలి. ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల పశువుల ఎరువును చల్లుకోవాలి. 25 నుంచి 30 కిలోల యూరియా, 40 నుంచి 50 కిలోల డీఏపీ, 20 నుంచి 30 కిలోల పొటాష్ను ఆఖరి దుకిలో వేసుకోవాలి. పందిరిసాగులో సాళ్ల మధ్య రెండు మీటర్ల దూరం, మొకల మధ్య 50 సెం. మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనం నాటిన నాలుగు నుంచి ఆరు రోజులకు మొలక వస్తుంది. 20-25 రోజులకు నాలుగు నుంచి ఎనిమిది ఆకులు వస్తాయి. ఈ దశలో రసం పీల్చే పురుగులను నియంత్రించాలి. లీటరు నీటికి 2 గ్రా. బోరాన్ కలిపి పిచికారీ చేయాలి.
సాధారణ పందిరి పద్ధతుల్లో కాకరను సాగుచేస్తే కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. రెండు మూడు సార్లు కలుపు తీయాల్సి వస్తుంది. ఒకసారికి కలుపు తీయడానికి కూలీల ఖర్చు రూ. 12వేల నుంచి రూ.15 వేల దాకా అవుతుంది. పూర్తి పంటకాలంలో కలుపు కోసమే రూ. 25వేల నుంచి రూ. 30 వేల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే మల్చింగ్ విధానంలో సాగుచేస్తే కలుపు సమస్య తగ్గుతుంది. ఇందుకోసం అదే ఎకరానికి రూ.12 వేల నుంచి రూ.15 వేలు ఖర్చు పెట్టి మల్చింగ్ వేసుకొంటే సరిపోతుంది.
కాకర నాటిన 40 నుండి 45 రోజుల మధ్యలో పూతకు వస్తుంది. మొదటి కోత 55 నుంచి 60 రోజులకు వస్తుంది. తీగలను పందిరి పైకి పాకనిస్తే కాయ దిగుబడి పెరుగుతుంది. పండు ఈగ నివారణకు ‘కుకుర్ ల్యూర్’ను వినియోగించాలి. ఒక ల్యూర్ ధర రూ.35 నుంచి రూ.40 దాకా ఉంటుంది. ఎకరానికి ఎనిమిది నుంచి పది ల్యూర్లను వాడాలి. లేదా లీటరు నీటిలో మలాథియాన్ 2 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణ కోసం లీటరు నీటిలో 5 మి.లీ. డైనోకాప్ లేదా 0.5 గ్రా. మైక్లోబ్యుటానిల్ (ఇండెక్స్) లేదా 0.8 గ్రా. హెక్సాకొనజోల్ కలిపి పిచికారీ చేయాలి.
కాకరలో చీడపీడల వల్లే ఎకువగా నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా పండు ఈగ, బూడిద తెగులు, ఆకుమాడు తెగులు తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే తెగుళ్లను నివారించవచ్చు. అంతేకాకుండా, కాకర సాగులో నీటి యాజమాన్యం కీలకం. ప్రస్తుత చలికాలంలో సాగుచేసే రైతులు నీటి తడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎరువులు, పోషకాలను డ్రిప్ ద్వారా అందిస్తే, ప్రతి మొకకూ
సమానంగా చేరి దిగుబడి అధికంగా వస్తుంది. ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ, సమయానుకూలంగా మెలకువలు పాటిస్తే అధిక లాభాలు
పొందవచ్చు.
-విద్యాసాగర్, ఉద్యానశాఖ అధికారి, నకిరేకల్.
-మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి