నార్నూర్, ఆగస్టు 24 : నేటితరం యువత అన్నాబావుసాటేను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆదిలాబాద్ జడ్పీ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. గురువారం ఖంపూర్ గ్రామంలో అన్నాబావుసాటే 103వ జయంతిని ఘనంగా నిర్వహించారు. దీనికి జడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజర య్యారు. అన్నా బావుసాటే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన జనార్దన్ మాట్లాడారు. చిన్నారులను ఉన్నత చదువులు చదివించాలని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సహకారంతో సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. జడ్పీ చైర్మన్ను శాలువా తో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ సలాం ఆనంద్రావ్, దళిత రత్న, అన్నాబావుసాఠే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్మోరే, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు జాదవ్ చంద్రశేఖర్, జీవవైవిద్య జిల్లా కమిటీ సభ్యుడు మర్సుకొల తిరుపతి, ఖైరదట్వా సర్పం చ్ కనక సేవంత ప్రభాకర్, నాయకులు కాంబ్లే సుదర్శన్, రాథోడ్ రమేశ్, హైమద్, రాథోడ్ సుభాష్, దావుల రమేశ్, కాంబ్లే హన్మంతు, సూర్యవంశీ ఆనంద్, బాలాజీ, సూర్యకాంత్, గ్రామపెద్దలు ఉన్నారు.