ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, డిసెంబర్ 20: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాల మైదానంలో సూల్ గేమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 67వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను జడ్పీటీసీలు నాగేశ్వరరావు, సంతోష్, డీఎస్పీ వెంకటరమణ, సీఐ రాజుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక, శారీరక ఎదుగుదల సాధ్యమవుతుందన్నారు. సింగల్ విండో చైర్మన్ ఆలీ బీన్ అహ్మద్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ గంధం శ్రీనివాస్, నాయకులు సిద్ధిక్ బాయ్. డీఎస్పీ ఎం వెంకటరమణ, సీఐ రాజు, జిల్లా గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి, ఏటీడీవో క్షేత్రయ్య, జీసీడీవో శకుంతల, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.