ఇంద్రవెల్లి, నవంబర్ 30 : తమ ఆస్తులను కాపాడేందుకు షర్మిల బీజేపీకి అమ్ముడుపోయి ముఖ్యమంత్రి కేసీఆర్పై పదేపదే విమర్శలు చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. సీఎం కేసీఆర్పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు చేసిన విమర్శలకు నిరసనగా ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో బుధవారం మండలకేంద్రంలో షర్మిల దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘షర్మిల గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలు షర్మిలను తరమికొడతారంటూ హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మహిళలపై అనేక దాడులతోపాటు లైంగికదాడులు జరిగిన సంఘటనలను షర్మిల మర్చిపోయిందన్నారు. కేసీఆర్ హయాంలో మహిళలకు అన్ని రకాలుగా రక్షణ ఉందన్నారు.
పట్టణాల్లో రోడ్షోలు చేయడం కాదని, గ్రామాల్లో పర్యటించి తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూడమని షర్మిలకు హితవు పలికారు. అనంతరం మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్ డోంగ్రే, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, సర్పంచులు గాంధారి, రాథోడ్ శారద, ఆడే విజయ, రాంచందర్, లఖన్సింగ్, నాగోరావ్, మోహన్రావ్, జుగదిరావ్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, కోవ రాజేశ్వర్, నాయకులు దేవ్పూజె మారుతి, షేక్ సుఫియాన్, కనక హనుమంత్రావ్, పోటే సాయినాథ్, సుంకట్రావ్, తోడసం హరిదాస్, ఆత్రం ధర్ము, మెస్రం తుకారాం, దుందేరావ్, నగేశ్, శివాజీ, నవాబ్బేగ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.