నేరడిగొండ, జనవరి 16 : యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జడ్పీటీసీ జాదవ్ అనిల్ సూచించారు. మండలంలోని తేజాపూర్ గ్రామంలో రెడ్డి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తాలూకా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రపూల్చందర్రెడ్డి, ఉపసర్పంచ్ దేవేందర్రెడ్డి, క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు.
నేరడిగొండ, జనవరి 16 : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రెండో విడుత కంటి వెలుగును అందరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కంటి వెలుగు ట్రయల్ రన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటిచూపు లేని వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కార్యక్రమం అద్భుతమైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ పెంట వెంకటరమణ, ఎంపీడీవో అబ్దుల్సమద్, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.