ఎదులాపురం, జూన్ 12 : దేశంలో ఇప్పటికీ బాలకార్మికులు ఉన్నారని, ఇందుకు వారి కుటుం బ పరిస్థితులే కారణమని జేజేబీ (జువైనల్ జస్టిస్ బోర్డు) చైర్పర్సన్, జూనియర్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్ మంజుల అన్నారు. సోమవారం జిల్లా కేం ద్రంలోని బాలరక్ష్ భవన్లో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో కొందరు తల్లిదండ్రులు పిల్లలను ఇ ప్పటికీ పనిలోకి పంపుతున్నారని చెప్పారు. అలా పంపడం చట్ట రీత్యానేరమన్నారు. 18 యేండ్లలోపు పిల్లలను ప్రమాదకరమైన పనులు చేయించవద్దన్నారు. అలా పనుల్లో పెట్టుకున్న వారికి ఆరు నెలల జైలు, రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 18 యేండ్ల వయసున్న పిల్లలకు చదువు చెప్పించాలన్నారు. వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అనేక విద్యా సంస్థలు ఏ ర్పాటు చేశాయని తెలిపారు. ఏఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చదువు మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించాలన్నా రు. బాల కార్మికు వ్యవస్థను నిర్మూలించాలని పే ర్కొన్నారు. అనంతరం మహితా స్వచ్ఛంద సం స్థ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి, సీడబ్ల్యూసీ సభ్యులు దశరథ్, సమీర్ ఉల్లాఖాన్, డీసీపీవో రాజేంద్రప్రసాద్, ఏఎల్వోలు వినోద్, రాజలింగు, చైల్డ్లైన్ కోఆర్డినేటర్ తిరుపతి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీకాంత్, త్రివేణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.