వేమనపల్లి, నవంబర్ 27 : ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మండలంలోని సుంపుటం గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని నిరుపేద గిరిజనులు అనారోగ్యం బారిన పడడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని గుర్తించామని, వారి కోసం అన్ని రకాల స్పెషలిస్టు వైద్యులతో శిబిరం నిర్వహించామన్నారు. గతంలో మావోయిస్టుల ప్రాబల్యంతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తు తం వారి ప్రాబల్యం తగ్గడంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
ప్రాణహిత ఆవల మహారాష్ట్రలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని, వారు వచ్చే అవకాశాలున్నాయని, ప్రజలు సహకరించవద్దని కోరారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువు, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. సుమారు 1000 మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మం దులను అందజేశారు. శిబిరానికి సహకరించిన వైద్యులను ఆయన అభినందించి సన్మానించారు.
అలాగే ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ను పోలీసులు, విజయవంతానికి కృషి చేసిన జైపూర్ ఏసీ పీ నరేందర్, చెన్నూరు రూరల్ సీఐ విద్యాసాగర్, నీల్వాయి ఎస్ఐ నరేశ్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను డీసీపీ సన్మానించారు. అనంతరం యు వకులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. పోలీ సు శాఖ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో వైద్యులు రష్మిత, నిఖిల్, జయశ్రీ, కృష్ణకాంత్, గుణవతి, నీలిమా, రవళి, మూర్తి, రాంబాబు, వెంకటేశ్వర్లు, సత్యనారాయ ణ, నిర్మ ల, పావణి, రాజేశ్, శేఖర్, సుభాష్, సత్యనారాయణ, కృష్ణ, లక్ష్మణ్, ప్రకాశ్, సుం పుటం సర్పం చ్ కొండగొర్ల బాపు, పీఈటీ మల్లేశ్, మాజీ స ర్పంచ్ కుబిడె వెంకటేశం, టీఆర్ఎస్ నాయకు లు మోర్ల మొండి, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.