సారంగాపూర్, జనవరి 24 : రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో మంగళవారం భూలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠాపన, పద్మశాలీ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం, ధ్వజారోహణ, మార్కండేయ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా మంత్రి ముఖ్య అతిథిగా హాజర్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నట్లు చెప్పారు. యాదాద్రి దేవాలయాన్ని కృష్ణ శిలలతో అందంగా నిర్మించుకున్నామని తెలిపారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత నియోజకవర్గంలో సుమారు 500కు పైగా దేవాలయాలకు నిధులు మంజూరు చేసి, పూర్వవైభవం తీసుకువచ్చామన్నారు. అలాగే రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్, రైతుబీమా, సబ్సిడీ కింద ఎరువులు, విత్తనాలు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కంటి వెలుగు, ఆసరా పింఛన్లు తదితర బృహత్తర పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, పార్టీ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, ఆలూర్ సొసైటీ చైర్మన్ ఎలిపెద్ది మాణిక్రెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ఎంపీటీసీ లయ, కో-ఆప్షన్ మెంబర్ సయ్యద్ ఇస్మాయిల్, అడెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు పతాని భూమేశ్, కరుణాసాగర్రెడ్డి పాల్గొన్నారు.
మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేత..
మండలంలోని గుండంపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమ ఆహ్వాన పత్రికను బుధవారం స్వామి దీక్షాపరులు బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి అందజేశారు. ఈ నెల 30 నుంచి మూడురోజుల పాటు జరిగే ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 1న విగ్రహ పత్రిష్టాపన ఉంటుందని మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంకటేశ్వర స్వామి దీక్షాపరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈద్గా డిజైన్ పరిశీలన..
నిర్మల్ పట్టణ శివారు చించోలి(బీ) గ్రామ శివారులో కొత్త ఈద్గా నిర్మాణానికి రూపొందించిన డిజైన్ను ముస్లిం మత పెద్దలతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈద్గా వద్ద మినార్ల ఏర్పాటు, ప్రహరీ, ప్రధాన ద్వారం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. సుమారు 12 ఎకరాల్లో ఈద్గా నిర్మిస్తున్నామని, త్వరలో పనులు ప్రారంభించి రంజాన్ పండుగ వరకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తౌహిద్ ఉద్దీన్ రప్పు, సలీం, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ముస్లిం మత పెద్దలు మహ్మద్ యూసుఫ్, హబీబ్ జిలానీ, నాయకులు రిజ్వాన్, అబ్దుల్ జావిద్, ఫిర్దోస్ ఖాన్, ముషీర్ పాల్గొన్నారు.