నిర్మల్ అర్బన్, జూలై 24 : విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. లోకేశ్వరం పోలీస్ స్టేషన్ హోంగార్డు తుంగెన నర్సింగ్ రావు ఏప్రిల్ 6న నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర కోసం విధి నిర్వహణకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మృతిచెందాడు. కాగా, యాక్సిక్ బ్యాంక్ ద్వారా మంజూరైన రూ.30 లక్షల చెక్కును సోమవారం ఎస్పీ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎస్పీ ప్రవీణ్ కు మార్ అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది శాలరీ అ కౌంట్ యాక్సిస్ బ్యాంక్కు అనుసంధానం చే యడం వల్ల రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే పోలీస్ అధికారులకు రూ.30 లక్షలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంక్ యాజమాన్యానికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి బాసర ట్రిపుల్ ఐటీ లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగం ఇచ్చినట్లు వెల్లడించారు. పోలీస్ శాఖ అధికారులు చొరవ తీసుకుని రూ.30లక్షల చెక్కును అందించడం, తమ కుటుంబాన్ని ఆదుకుంటున్న ఎస్పీకి బాధిత కుటుంబ స భ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ క్రాంతిలాల్ పాటిల్, అదన పు ఏఆర్ ఎస్పీ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రమేశ్, రామకృష్ణ, లోకేశ్వరం ఎస్ఐ సాయి కుమార్, బ్యాంకు సిబ్బంది, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.