ఎదులాపురం, ఫిబ్రవరి 7 : గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్న పిల్లలకు హైదరాబాద్లోని కార్పొరేట్ దవాఖానలో ఉచితంగా శస్త్ర చికిత్స లు చేయించి తీసుకొస్తామని డీఐవో, ఆర్బీఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్ మెట్పెల్లివార్ శ్రీకాంత్ పేర్కొ న్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ దవాఖానలో రెయిన్బో చిల్ట్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ హైదరా బాద్కు చెందిన డాక్టర్ వెంకట పవన్ కుమార్ (పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్) సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి గుండె వ్యాధితో బాధపడుతున్న 76 మంది పిల్లల కు పరీక్షలు చేశారు. పలువురు చిన్నారులకు శస్త్ర చికిత్స అవసరమని గుర్తించారు. పిల్లలను ఉచి తంగా ఆర్బీఎస్కే వాహనంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేయిం చి తిరిగి పిల్లలను ఇంటికి చేరవే స్తామని డీఐవో తెలిపారు. ఉచితంగానే మూడు నెలలకు ఓ సారి క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
అడిషనల్ కలెక్టర్ తనిఖీ
రిమ్స్లో వైద్యశిబిరం, చిన్నపిల్లల వార్డును స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తనిఖీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైద్యసేవలు అందించాలన్నారు. అనంతరం రిమ్స్లో ఎస్ఎన్సీయూ, ఎన్ఆర్సీ సెంటర్ను తనిఖీ చేశారు. శస్త్ర చికిత్స అవసరం ఉన్న చిన్నా రులకు సూపర్ స్పెషాలిటీ దవాఖానలో సర్జరీ చేసే లా చూడాలని రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జై సింగ్ కు సూచించారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డైస్ మేనేజర్ జావింద్ నాయక్, వైద్యులు ప్రణ య్, రాధిక, స్పెషల్ ఎడ్యుకేటర్ దొంతుల ప్రవీణ్, ప్రశాంత్ పాల్గొన్నారు.