ఉట్నూర్, జనవరి 12 : యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో వీహెచ్పీ ఆధ్వర్యంలో గురువారం వివేకానంద జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి, నాయకులు రాథోడ్ రమేశ్, సట్ల అశోక్, నందిరెడ్డి, రమేశ్, కిరణ్, రాజశేఖర్, రాములు, శ్రీనివాస్, శంకర్, యువకులు పాల్గొన్నారు.
దేశానికే యువత ఆదర్శం
దేశానికే యువత ఆదర్శమని డీఎస్పీ ఉమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం, వివేకానంద జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, ప్రధాన కార్యదర్శి మాధవ్, సభ్యులు పరమేశ్వర్, రాకేశ్ ఖత్రి, సుభాష్, శశికళ, శంకర్, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు రాజేశ్వర్, విశ్వహిందూ పరిషత్ నాయకులు శ్రీరామ్శర్మ, తదితరులు పాల్గొన్నారు.
బోథ్ మండలంలో..
మండలంలోని సొనాల, కన్గుట్ట, బోథ్, పొచ్చెర గ్రామాల్లో యూత్ సభ్యులు, నాయకులు స్వామి వివేకానంద చిత్రపటం, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో వివేకానంద యూత్ సభ్యులు, నాయకులు, ఎన్సీసీ కేడెట్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. బోథ్లోని నాగభూషణం పాఠశాలలో విద్యార్థులు వివేకానందుని వేషధారణలో ఆకట్టుకున్నారు.
పిప్పల్కోటిలో..
మండలంలోని పిప్పల్కోటి యూపీఎస్లో స్వామి వివేకానంద జయంతి నిర్వహించారు. సంక్రాంతి నేపథ్యంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సర్పంచ్ కళ్యాణి, ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఉపాధ్యాయులు శంకర్, సంతోష్ , గ్రామస్తులు పాల్గొన్నారు.
రక్తదానం శిబిరం
పట్టణానికి చెందిన బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో కోర్పనా, చంద్రపూర్ జిల్లాలో రక్తదానం శిబిరం నిర్వహించారు. 48 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పాలకొండ శ్రీకాంత్, మహేందర్, వర్ష, దినేశ్, చంద్రాపూర్ మెడికల్ ఆఫీసర్ షాలిని, తిరుణి, ఎస్ఐ డాక్నే పాల్గొన్నారు.
మండల కేంద్రంతో పాటు మండలంలోని కుచులాపూర్, సాయిలింగి, సుంకిడి, భరంపూర్, దేవాపూర్ గ్రామాల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కజ్జర్ల ఉన్నత పాఠశాలలో శివశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో జై బ్లూ భీం యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పద్మాకర్ రెడ్డి, ప్రేమేందర్, శివ, అరవింద్, యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.