కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట ( Kasipet ) మండల కేంద్రంలోని తూర్పు వాడలో గ్రామస్థులు వాహనాలను అడ్డుకొని రోడ్డు నిర్మించాలని ( Road construction ) నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి వాహనాలు, దేవాపూర్ సిమెంట్ కంపెనీ, తదితర వాహనాలు మందమర్రిలో ఉన్న టోల్ ప్లాజాను తప్పించుకునేందుకు గ్రామంలోకి భారీ వాహనాలు రావడం వల్ల రోడ్డు ధ్వంసం అయిందని మండి పడ్డారు.
టోల్ ఖర్చులు తప్పించుకోవడానికి భారీ లోడుతో ఉన్న భారీ వాహనాలు ఈ దారి నుంచి వెళ్లడం ద్వారా కాసిపేట గ్రామ ఆర్అండ్ బీ రోడ్డు పూర్తిగా చెడిపోయిందన్నారు. సింగరేణి సంస్థ ఓసీలో దొరికే మట్టి పోసి ఉన్న రోడ్డును కాస్త మరింత నాశనం చేశారని మండి పడ్డారు. ఆ మట్టి మొత్తం దుమ్ము లేచి ఇండ్లలోకి చేరి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్అండ్ బీ అధికారులు, సింగరేణి యాజమాన్యం స్పందించి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.