తానూర్, నవంబర్ 27 : క్రీడల్లో గెలుపోట ములు సహజమేనని గ్రామ సర్పంచ్ తాడేవార్ విఠల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని డాంగపెల్లి మైదానంలో కార్త్తీక పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్లో నిర్వ హించిన పోటీల్లో 38 జట్లు పాల్గొన్నాయి. ఆదివా రం జరిగిన పైనల్ మ్యాచ్లో హిప్నెల్లి వర్సేస్ బోధన్ టీమ్లు పోటీ పడ్డాయి. హిప్నెల్లి జీమ్స్ జట్టు మొదటి బహుమతి రూ 41వేలు, గ్రామ సర్పంచ్ తాడేవార్ విఠల్ అందజేశారు.
ద్వితీయ బహుమతి బోధన్ రియాన్ జట్టుకు రూ 31 వేలు జాదవ్ శివాజీరావ్ పటేల్ అందజేశారు. తృతీయ బహుమతి తానూర్ అక్బర్ ఏలెవన్ జట్టుకు మాజీ సర్పంచ్ జాదవ్ మాధవ్రావ్ పటేల్ రూ.15,550 అందజేశారు. నాల్గో బహు మతి ఆర్దాపూర్ ఏలెవన్ జట్టుకు రూ. 12,550 డాక్టర్ చంద్రకాంత్ జోగ్దండ్ అందజేశారు. మైదానం లో డాక్టర్ రాజు అన్నదానం నిర్వహించారు. ఎస్ఐ విక్రమ్, సర్పంచ్ విఠల్, మాజీ సర్పంచ్లు మాధవ్రావ్ పటేల్, రాములు, నాయకులు శివాజీరావ్ పటేల్, డైరెక్టర్ పుండ్లిక్, ఉప సర్పంచ్ నయీం, ఆలయ కమిటీ కార్యదర్శి గోవింద్ పటేల్, భగవాన్ పవార్, సోమనాథ్, చోటేఖాన్, పోశెట్టి, టోర్నీ నిర్వాహకులు దొంతుల పోశెట్టి, నర్సయ్య, రాజు, సాయినాథ్ పాల్గొన్నారు.