మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 28: బ్యాంకులు అందిస్తున్న సేవలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, ఆ మేరకు బ్యాంకర్లు చైతన్య పరచాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంచిర్యాలలో యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రిటైల్ ఎక్స్పోను బుధవారం ఆయన ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూనియన్ బ్యాంకు కరీంనగర్ రీజియన్ డీజీఎం అపర్ణా రెడ్డి మాట్లాడుతూ తమ బ్యాంకు గత 105 ఏండ్లుగా ప్రజలకు సేవలందిస్తున్నదని, 8.35 శాతం నుంచి తకువ వడ్డీ రేటుతో గృహ రుణాలను అందించే పథకాల్లో అత్యుత్తమంగా ఉందని వివరించారు.
8.80 శాతం వద్ద కార్ లోన్లు, ఎలక్ట్రిక్ కార్ లోన్లు, 8.70 శాతం వడ్డీతో స్వదేశీ చదువుల కోసం రూ.7.50 లక్షల వరకు అనుషంగిక భద్రత లేకుండా విద్యా రుణం, విదేశాల్లో చదువుకోవడానికి, ఎంపిక చేసిన ప్రీమియర్ సంస్థల కోసం రూ.40 లక్షల కొలేటరల్ ఉచిత విద్యా రుణం, ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు, సింగరేణి ఉద్యోగులు రూ.1.15 కోట్ల ఉచిత ప్రమాద బీమా కవరేజీతో జీతం ఖాతాలను తెరవడానికి బ్యాంక్ తో ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నలమాసు కాంతయ్య, మంచిర్యాల జిల్లా రైస్ మిల్లర్ల సంఘం కార్యదర్శి చిలువేరు వైకుంఠం, రామగుండం ఆర్ఎఫ్సీఎల్ సీజీఎం సుధీర్ కుమార్ ఝూ, బ్యాంకు డీజీఎం మురళీకృష్ణ, వై సురేశ్, పీ శ్రీరామ్, వికాస్ కుమార్, మారుతి, మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్ని వివిధ శాఖలకు చెందిన బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.