సిర్పూర్(టీ), మే 25 : సిర్పూర్(టీ) మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. డోర్పల్లిలో తాటి చెట్టుపై పిడుగుపడింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిం ది. కేశవపట్నంలో పిడుగుపడి రెండు ఎడ్లు మృత్యువాత పడ్డాయి. సిర్పూర్(టీ)-కౌటల ప్రధాన రహదారి డౌనల్ ప్రాంతం లో చెట్టు రోడ్డుపై పడింది. గంట పాటు ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది.