జైనూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలానికి చెందిన పుర్కా అనసూయ బాయి ( Anasuyabai ) అనే గిరిజన మహిళ 108 అంబులెన్స్ ( Ambulance ) లో ప్రసవించింది. కాన్పు కోసం ఆమెను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా జైనూర్ సమీపంలో మార్గమధ్యలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఈఎంటి రవి, పైలెట్ కిరణ్ తెలిపారు. మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికమవడంతో చాకచక్యంగా వ్యవహరించి సాదారణ కాన్పు అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వారు తెలిపారు. మెరుగైన వైద్య సేవల కోసం రిమ్స్ కు తరలించినట్లు వారు పేర్కొన్నారు.