ఆదిలాబాద్: జీవో 49కు వ్యతిరేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad) బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛంగా బంద్ పాటిస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క దుకాణం కూడా తెరచుకోలేదు. బస్సులు కూడా నడవకపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కోన్ని చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డగించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్ ఏజెన్సీలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోనూ ప్రజలు స్వచ్ఛంగా బంద్ పాటిస్తున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఐదో షెడ్యూల్ ప్రాంతంలోని భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 1/70, పెసా, ఆదివాసి చట్టాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆదివాసీల మనుగడను ఆదివాసిల హక్కులను జీవోలను ఉల్లంఘిస్తూ ఏటువంటి గ్రామసభ తీర్మానాలు లేకుండానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్రం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన జీవో 49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బంద్కు ఆదివాసీ తుడుందెబ్బతోపాటు ఆదివాసి సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి సీపీఎం, సీపీఐ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.