యంత్రాల సాయంతో 40 చెట్ల తొలగింపు..
వేరే చోట నాటుతున్న అటవీ, రహదారుల శాఖ అధికారులు
మామడ, జూన్ 15 : నిర్మల్-ఖానాపూర్ జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. రహదారి మధ్య రావి, మర్రి, వేప, చింత చెట్లు దాదాపు 80 వరకు నిర్మాణానికి ఆటంకంగా ఉన్నాయి. వీటిని బుధవారం ట్రీ ట్రాన్స్లోకేషన్ కార్యక్రమంలో భాగంగా అటవీ, రహదారుల శాఖ అధికారులు యంత్రాల సహాయంతో తీసి.. కొద్ది దూరంలో గుంతలు తవ్వి నాటారు. 40 ఏండ్లలోపు ఉండి, 40 సెంటీమీటర్ల చుట్టూ కొలత కలిగిన చెట్లను ఇతర ప్రదేశాల్లో నాటుతున్నారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్వో వికాస్మీనా, ఎఫ్డీవో సిద్ధార్థ విక్రమ్ సింగ్, జాతీయ రహదారుల శాఖ డీఈ సుభాష్బాబు, ఏఈ భూపేశ్, ఎఫ్ఆర్వో అవినాష్, గ్రీన్ మార్నింగ్ రాంచందర్, లేకాన్ ఇన్ఫ్రా పీఎం నాగేంద్ర ఉన్నారు.