నిర్మల్ చైన్గేట్, మే 30:బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, రికవరీలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో డీఆర్డీవో కే విజయలక్ష్మి, ఏపీడీ గోవిందరావు, డీపీఎం విజయలక్ష్మి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా అవార్డులు అందుకు న్నారు. గతేడాది రుణాల పంపిణీ లక్ష్యం రూ. 399 కోట్లు కాగా, రూ. 405 కోట్లు స్వశక్తి సంఘాలకు పంపిణీ చేశారు. 99.80 శాతం రికవరీ చేశారు. దీంతో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు మంత్రితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అవార్డులు అందజేశారు.