హాజీపూర్, ఫిబ్రవరి 16 : సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ పింఛన్ విధానాన్ని తీసుకురావాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లాలోని నస్పూర్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎదుట తెలంగాణ నాన్ గెజిటెడ్ (టీఎన్జీవో) ఉద్యోగుల సంఘం ఆధ్వర్వంలో నల్ల బ్యాడ్జీలను ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూముల రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, సంఘం నాయకులు పాల్గొన్నారు.