మంచిర్యాల ఏసీసీ, మే 25 : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 5 నెలలుగా తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి, బంగారు, వెండి ఆభరణాల దొంగతనానికి పాల్పడుతున్న ఏడుగురు యువకులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నస్పూర్కు చెందిన పాగిడి కార్తిక్, గన్నారం మధూకర్, మంచిర్యాల గాంధీ నగర్కు చెం దిన తాటికొండ స్వామి చరణ్, బెల్లంపల్లికి చెందిన పుప్పాల రాహుల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం కాసిపేటకు చెందిన కుర్సింగ ఈశ్వర్, కన్నెపల్లికి చెందిన వేడ్మ ప్రవీణ్, తిర్యాణికి చెందిన మడావి రాము జల్సాలకు అలవాటు పడ్డారని తెలిపారు. అందుకు సులువుగా డబ్బు సంపాధించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు.
ఈ మేరకు పగలు బైక్పై తిరుగుతూ.. తాళం వేసిన ఇండ్లను గమనించి, రాత్రి దొంగతనం చేస్తున్నారని తెలిపారు. దొంగిలించిన వస్తువులను కరీంనగర్లో అ మ్మేందుకు ఐదుగురు గాంధీనగర్లోని తాటికొండ స్వామి చరణ్ ఇంటి వద్ద ఉన్నారన్న స మాచారంతో అక్కడికి వెళ్లి, వారిని పట్టుకున్నట్లు చెప్పారు. మరో ఇద్దరిని రామకృష్ణాపూర్లోని క్యాతనపల్లి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, పరిపోయే క్రమంలో అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.
వారందరినీ విచారించగా, నేరాన్ని ఒప్పుకున్నారని పేర్కొన్నారు. వారి నుంచి బంగారు ఆభరణాలు( రూ.9,22 లక్షల విలువ), వెండి (రూ.60 వేల విలువ), రూ.50 వేల విలువగల బైక్, రూ.1.20 లక్షల విలువగల స్మార్ట్ టీవీ, హోమ్ థియేటర్, రూ.20 వేల విలువల గల గిటార్ మొత్తం విలువ రూ.11,72 లక్షలు ఉంటుందన్నారు. అనంతరం నిందితులను చాకచక్యంగా పట్టకున్న పోలీసులను అభినందించి, వారికి రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మంచిర్యాల టౌన్ సీఐ బన్సీలాల్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాలలో దొంగతనం చేసిన ప్రాంతాల వివరాలు..
ఫిబ్రవరి మొదటి వారంలో మంచిర్యాలలోని జాఫర్ నగర్లో గల ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువాలోని రెండు బంగారు ఉంగరాలు, ఒక జత చెవి కమ్మలు దొంగిలించిన ట్లు సీపీ వివరించారు. మార్చి రెండో వారం లో సీసీసీ నస్పూర్లోని ఓ ఇంట్లో రూ.50 వే లు, బంగారు చైన్, ఒక జత చెవి కమ్మలు.., ఏప్రిల్లో మాక్స్ షాపింగ్ మాల్ దగ్గర గల సాయి హనుమాన్ నగర్లోని ఇంట్లో బంగా రు చైన్, రెండు చిన్న బంగారు గాజులు, 5 ఉంగరాలు, 3 వెండి గిన్నెలు, 2 వెండి చిన్న చేతి కడియాలు, వెండి కాలి కడియం, రెండు జతల వెండి కాలి పట్టీలు.., ఏప్రిల్ రెండో వారంలో హాజీపూర్ మండలంలోని గుడిపేట్లో 10 జతల వెండి కాలి పట్టీలు, వెండి కడియాలు, బంగారు చైన్, చిన్న బంగారు ఉంగరం, రూ.20 వేలు.., అదే రోజున దొంగతనం చేసి, తిరిగివస్తూ మార్గమధ్యంలో వేంపల్లిలోని ఎస్బీఆర్కాలనీలోని ఓ ఇంట్లో ఒక స్మార్ట్ టీవీ, హోమ్ థియేటర్.., అదే నెలలో మారుతినగర్లోని ఓ ఇంట్లోకి చొరబది ఒక్కోటి తులంనర గల రెండు బంగారు నెక్లెస్లు, సుమారు 3 తులాలు గల రెండు బంగారు గొలుసులు, ఒక ల్యాప్టాప్, మొబైల్ దొంగిలించినట్లు వెల్లడించారు.
రామకృష్ణాపూర్, బెల్లంపల్లి వన్, టూ టౌన్, మందమర్రిలో..
గద్దెరాగడిలోని ఓ ఇంట్లో బంగారు గొలు సు, వెండి పట్టీలు, నగదు, పూజా (వెండి) సామగ్రి.., బెల్లంపల్లి స్టేషన్ రోడ్డు కాలనీలోని ఓ ఇంట్లో బంగారు ఉంగరం, బంగారు చైన్, మూడు బంగారు ఉంగరాలు, రూ.20 వే లు.., అమ్మగార్డెన్ ఏరియాలో రూ.25 వేలు, కెమెరా.., బెల్లంపలిలోని బూడిదగడ్డబస్తీలో ఒక జత వెండి కడియాలు, ఒక జత చెవి కమ్మలు, బంగారు ఉంగరం, మొబైల్.., ఆర్ఆర్ నగర్లో రెండు ఇండ్లలో ఒక బంగారు ఉంగరం, చెవికమ్మలు.., బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాలో హోండా షైన్ బైక్ను దొంగలించినట్లు వివరాలు వెల్లడించారు.