బోథ్, డిసెంబర్ 1 : ఎయిడ్స్పై ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని బోథ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బీ హుస్సేన్ అన్నారు. ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల కేంంద్రంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడుతూ ఎయిడ్స్ అంటువ్యాధి కాదని.. జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి పంద్రం శంకర్, న్యాయవాదులు ఆడుపు హరీశ్, కుమ్మరి విజయ్కుమార్, సిబ్బంది శశికళ, స్రవంతి, సంగీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉట్నూర్రూరల్, డిసెంబర్ 1 : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పావని, అధ్యాపకులు కేశవులు, శ్రీనివాసరావు, సువర్ణ, శ్రీలత, వినోద్, గణేశ్, లక్ష్మణ్రెడ్డి, తిరుపతి, సాంబరాజు, నవీన్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్, డిసెంబర్ 1 : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో వైద్య సిబ్బంది ర్యాలీ తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి నిలోఫర్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, డిసెంబర్ 1 : ఎయిడ్స్ వ్యాధి అవగాహనతోనే అంతం అవుతుందని ప్రిన్సిపాల్ జాదవ్ గణేశ్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ తీశారు. విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అలాగే మండల కేంద్రంలోని పీహెచ్సీ ఆధ్వర్యంలో, గేర్జం గ్రామంలో వైద్య సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ హెచ్ సత్యనారాయణ, ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ఆఫీసర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, జీ రాజేశ్వర్, మాధవి, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, డిసెంబర్ 1 : ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బాలాజీకాంబ్లే అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉదయ్కుమార్, ఏజీఎంసీ వెంకటరమణ, తిరుపతిరెడ్డి, ఉదయ్రెడ్డి, నరేశ్, శ్రీనివాస్, నాగేశ్వరరావు, సుజాత, శారద తదితరులు పాల్గొన్నారు.
బేల, డిసెంబర్ 1 : ఎయిడ్స్ రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆశ కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా ర్యాలీ తీశారు. కార్యక్రమంలో డాక్టర్ క్రాంతికుమార్, బేల సర్పంచ్ ఇంద్రశేఖర్, మాజీ సర్పంచ్ మస్కే తేజ్రావ్, నాయకులు సతీశ్ పవార్, మధుకర్, బాలేరావ్, వైద్య సిబ్బంది శ్యామల, రాధ, లలిత, స్వర్ణలత, సవిత్రి , సరోజ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎదులాపురం, డిసెంబర్ 1 : ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రిమ్స్ నర్సింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ముందుగా ర్యాలీని రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ జెండాఊపి ప్రారంభించారు. అనంతరం రిమ్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ మాట్లాడుతూ రిమ్స్లో ఎయిడ్స్ బాధితులకు ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నామని అన్నారు. ఉచితంగా మందులు, ప్రభుత్వం ద్వారా పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు తిప్పస్వామి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
భీంపూర్, డిసెంబర్ 1 : భీంపూర్, కరంజి(టీ), అంతర్గాం, అర్లి(టీ) గ్రామాల్లో వైద్య సిబ్బంది, విద్యార్థులు ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ తీశారు. కార్యక్రమంలో హెచ్ఈవో లింగంపల్లి జ్ఞానేశ్వర్, సిబ్బంది గంగాధర్,లూసి, జనాబాయి, అశోక్రెడ్డి, సరస్వతి , గోదావరి , సుజాత , సర్పంచ్లు మడావి లింబాజీ, బక్కి లలిత, స్వాతిక, గొల్లి రమాబాయి , బక్కి అజయ్యాదవ్, ఆశకార్యకర్తలు, ప్రధానోపాధ్యాయులు ఎలియా, భూమన్న, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.