గ్రామదేవతలకు చలిబోనాల సమర్పణ
మొక్కులు చెల్లించుకున్న మహిళ
భైంసా, ఫిబ్రవరి, 6 : పట్టణంలోని మహిళలు ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. మార్కెట్ ఏరియాలోని మహాలక్ష్మీ ఆలయంలో ఆయా కాలనీలకు చెందిన మహిళలు పూజలు చేశారు. ఆలయ కమిటీ బాధ్యులు ఏర్పాట్లు చేశారు.
కుంటాల, ఫిబ్రవరి 6 : కుంటాలలో చలిబోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఏటా నూతన ధాన్యం ఇంటికి రాగానే బోనాలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. కుంటాలతో పాటు పరిసర గ్రామాల మహిళలు గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ, పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. పంటలు బాగా పండాలని, ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకున్నారు.
లక్ష్మణచాంద, ఫిబ్రవరి 5 : మండలంలో ఆదివారం చలి బోనాల పండుగ నిర్వహించారు. శనివార రాత్రి బోనాలు వండి ఆదివారం ఉదయం గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించారు. ధర్మారంలోని పోచమ్మ ఆలయానికి మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చారు. లక్ష్మణచాంద నుంచి మహిళలు పాటలు పాడుతూ ఊరేగింపుగా వెళ్లిన తీరు ఆకట్టుకుంది. ఎంపీపీ అడ్వా ల పద్మ ప్రత్యేక పూజలు చేశారు.
సారంగాపూర్, ఫిబ్రవరి 6: మండల కేంద్రం తో పాటు జామ్, ధని, ఆలూర్, బోరిగాం, కౌట్ల (బీ) తదితర గ్రామాల్లో బోనాల పండుగ నిర్వహించారు. మహిళలు శనివారం రాత్రి చలిబోనం వండి ముత్యాలమ్మ, మహాలక్ష్మి ఆలయాల్లో నైవేద్యాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు.
ఖానాపూర్ టౌన్, ఫిబ్రవరి 6 : పట్టణంలోని ముత్యాల పోచమ్మ, గాంధీనగర్ నల్ల పోచమ్మ ఆలయాల్లో అమ్మవారికి భక్తులు చలి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పోచమ్మ, మహాలక్ష్మి, గ్రామ దేవతలకు పూజలు చేశారు.
దస్తురాబాద్,ఫిబ్రవరి6:దస్తురాబాద్, భూత్కుర్లోని ముత్యాల పోచమ్మ ఆలయాలు భక్తులతో సందడిగా కనిపించాయి. ఆయా గ్రామాల్లోని మహిళలు ఉదయమే బోనాలతో ర్యాలీగా అమ్మవారి ఆలయాలకు చేరుకొని నైవేద్యం సమర్పించారు. మేకలు, కోళ్లు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి వన భోజనాలు చేశారు.
లోకేశ్వరం, ఫిబ్రవరి 6 : లోకేశ్వరంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు అమ్మవార్లకు చలి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
ముగిసిన విగ్రహ ప్రతిష్ఠాపన
ఖానాపూర్ రూరల్, ఫిబ్రవరి 6 : మండలంలోని మస్కాపూర్లో ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన ఆదివారంతో ముగిసింది. గ్రామంలోని పోచమ్మ ఆలయానికి వందలాదిగా మహిళ భక్తులు బోనాలతో తరలివచ్చారు. ఊరేగింపులో పోతురాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. వేదపండితులు నిమ్మగడ్డ సందీప్ శర్మ, విష్ణుబొట్ల రాఘవ శర్మ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పుప్పాల స్వప్న, గజేందర్, సర్పంచ్ అడిదెల మహేందర్, ఆలయ కమిటీ సభ్యులు దొనికెని నారాయణ, అడ్వాల రాములు, అడిదెల చిన్నయ్య, దాడిశెట్టి రాజరెడ్డి, బాసెట్టి చిన్నయ్య, జిల్లా శ్రీనివాస్, అడిదెల మధు, చిలివేరి గిరి, ఇనుముల రాజేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు. మండలంలోని తర్లపాడులో పోచమ్మ తల్లికి చలిబోనాలు సమర్పించారు. కార్యక్రమంలోగ్రామస్తులు పాల్గొన్నారు.
కడెం, ఫిబ్రవరి 6: మండలంలోని పాండపూర్ సమీపంలో ముత్యాల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. పాండపూర్, కొండుకూరు గ్రామాల నుంచి మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కొండుకూర్ సర్పంచ్ వేణుగోపాల్, విగ్రహదాత మల్లీశ్వరి రాజేశ్వర్, ఆలయ నిర్మాణదాత ముక్కెర శ్రీనివాస్, గ్రామస్తులు, భక్తులు