ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 22: గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష-2026 ప్రశాంతంగా జరిగినట్లు సాంఘి క సంక్షేమ గురుకులాల కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సమన్వయ అధికారి శారద తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల నుం చి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 23 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 5847 మంది విద్యార్థులకు గాను 5645 మంది హాజరయ్యారని, 202 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

సిర్పూర్(టీ), ఫిబ్రవరి 22 : సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో నిర్వహించిన గురుకులాల ప్రవేశ పరీ క్ష ప్రశాంతంగా జరిగింది. గురుకుల బాలికల పాఠశాలలో మొత్తం 360 మంది విద్యార్థుల కు గాను 354 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ శారద తెలిపారు. జడ్పీ పాఠశాలలో మొత్తం 292 మంది విద్యార్థులకు 283 మం ది హాజరైనట్లు జడ్పీ పాఠశాల సీఎస్ వెంకటరమణ పేర్కొన్నారు. పరీక్ష నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆదేశాల మేరకు ప్రవేశ పరీక్ష కేంద్రా ల ముందు విద్యార్థులు, తల్లిదండ్రులకు బీఆర్ఎస్ నాయకులు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొంగ సత్యనారాయణ, అస్లాంబిన్ అబ్దుల్లా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 22 : పట్టణంలోని కాసిసేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం టీజీసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆరో తరగతి విద్యార్థులను 388 మంది విద్యార్థులకు గాను 376 మంది హాజరయ్యారు. డిపార్ట్మెంటల్ అధికారిగా వినోద్కుమార్ పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.