కుభీర్ : భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావును కుభీర్ మండల నాయకులు హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు (New Year Greetings ) తెలిపారు. కుభీర్ సహకార సంఘం తాజా మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్ తో పాటు పలువురు పార్టీ నాయకులు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేటీఆర్కు పుష్పగుచ్చo అందించి శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పోరాట పటిమతో ముందుకు సాగాలని కేటీఆర్ సూచించినట్లు చరణ్ తెలిపారు.ఆయన వెంట ముధోల్ నియోజక వర్గ నాయకులు ఉన్నారు.