అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఒకటి, ఆదిలాబాద్ నుంచి ఇండిపెండెంట్గా అన్నం దేవేందర్, చెన్నూర్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సోగాల సంజీవ్, ఇండిపెండెంట్గా సోగాల సంజీవ్, బెల్లంపల్లిలో బీజేపీ అభ్యర్థిగా అమురాజలు శ్రీదేవి, మంచిర్యాలలో విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా గొర్లపల్లి సురేశ్, నిర్మల్లో బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్రెడ్డి(2 సెట్లు), ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి శేక్ హైదర్, మథోల్లో కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు పటేల్, ఖానాపూర్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి కుతాటి విజయ, సిర్పూర్(టీ) నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ తరఫున ఒక నామినేషన్ దాఖలైంది.
– ఆదిలాబాద్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థుల నుం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలైంది. మొ త్తంగా 10 నియోజకవర్గాల్లో కలిపి 11 దాఖలయ్యాయి. ఖానాపూర్ నుం చి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి కుతాటి విజయ తన నామినేషన్ దా ఖలు చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా అన్నం దేవేందర్ నామినేషన్ వేశారు. బోథ్ లో ఒక్కటీ నమోదు కా లేదని రిటర్నింగ్ అధికారి ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్ తెలిపారు. మంచిర్యాలలో విద్యార్థుల రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లపల్లి సురేశ్ తన నామినేషన్ మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రా ములుకు అందజేశారు.
నిర్మల్లో మూడు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రత్నకల్యాణి తెలిపారు. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి తన సతీమణి కవితతో కలిసి రెండు సెట్ల నామినేషన్లు దా ఖలు చేయగా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి షేక్ హైదర్ ఒక నామినేషన్ దాఖ లు చేసినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. ముథోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ రావు పాటిల్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోమల్ రెడ్డి కి అందజేశారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా సోగాల సంజీవ్ తన నామినేషన్ పత్రాలను ఎ న్నికల రిటర్నింగ్ అధికారి సిడాం దత్తుకు సమర్పించారు. సిర్పూర్ నియోజవకర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి శ్రీనివాస్ తరఫున ఆయన సతీమణి రావి సునీత రిటర్నింగ్ అధికారి దీపక్ తివారీకి ఒక నామినేషన్ సెట్ అందజేశారు. బెల్లంపల్లిలో బీజేపీ అభ్యర్థ్ధి అమరాజుల శ్రీదేవి తన నామినే షన్ ప్రతాన్ని ఎన్నికల అధికారి రాహుల్కు అందజేశారు.