దిలావర్పూర్, ఫిబ్రవరి 8 : నర్సరీల నిర్వహణలో అలసత్వం వహించ వద్దని, మొక్కలను సిద్ధం చేయాలని అధికారులను నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే ఆదేశించారు. దిలావర్పూర్ మండలం న్యూ లోలం, గుండంపల్లి గ్రామాల్లోన్ని నర్సరీలు, సెగ్రిగేషన్ షెడ్లు, గుండంపల్లిలోని ‘మన ఊరు-మన బడి’ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంచాయతీలకు ఆదాయం సమకూర్చే పనుల్లో భాగంగా చేపట్టిన సెగ్రిగేషన్ షేడ్డు ద్వారా, తడి, పొడి చెత్త వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేయాలని సూచించారు. నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దని, వాటిపై ఎక్కువ దృష్టిపెట్టాలని ఆదేశించారు. ‘మన ఊరు-మన బడి’ పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. ఈయన వెంట ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజీజ్ఖాన్, ఈజీఎస్ ఏపీవో దివ్యరెడ్డి, స్థానిక సర్పంచులు సంగీత, ఓడ్నం సవిత కృష్ణ, జడ్పీటీసీ రమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు సునీల్, స్వాతి, టెక్నికల్ అసిస్టెంట్లు రమణ, వెంకట్, ఫీల్డ్ అసిస్టెంట్లు గోవిందుల మహేశ్, బలరాం తదితరులు ఉన్నారు.