శ్రీరాంపూర్, ఫిబ్రవరి 19: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో నాలుగు రోజులు గా హోరాహోరీగా సాగు తున్న జాతీయస్థాయి స బ్ జూనియర్ బాల్బ్యాడ్మింటన్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. సోమవారం ఫైనల్ మ్యా చ్లు జరగనున్నాయి. నాలుగో రోజు ఆదివారం లీగ్ నాకౌట్ సెమీఫైనల్ పోటీల్లో గెలిచి బాలుర వి భాగంలో తమిళనాడు, కేరళ ఫైనల్కు చేరాయి. బాలికల విభాగంలో తమిళనాడు, ఏపీ జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. సెమీఫైనల్ బాలుర విభాగంలో తమిళనాడు జట్టు తెలంగాణాపై గెలిచిం ది. కేరళ జట్టు మహారాష్ట్రపై విజయం సాధంచిం ది. అలాగే బాలికల విభాగంలో రాజస్థాన్ జట్టుపై తమిళనాడు గెలవగా, కేరళ జట్టుపై ఏపీ విజయం సాధిచింది. సోమవారం జ రగనున్న ఫైనల్ పోటీల్లో విజేతలెవరో తేలనుంది.
అంతక ముం దు నాలుగో రోజు పోటీలను ఆదివారం శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి, నస్పూర్ మున్సిపల్ చైర్మ న్ ఇసంపెల్లి ప్రభాకర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి క్రీడాకారులను పరిచ యం చేసుకొని ప్రారభించారు. ఈ సం దర్భంగా జీఎం మాట్లాడుతూ క్రీడాకారులు ఎంతో ఉత్సా హంగా క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారని చెప్పా రు. క్రీడా స్ఫూర్తితో ఆడి రాణించాలని కోరారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను అభినందించారు. ఏషియన్ బాల్ బ్యాడ్మిం టన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వై రాజారావు, బాల్ బ్యా డ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి దిన్షా, ప్రిన్సిపాల్ అడ్మినిస్ట్రేట్ బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఇండియా సభ్యుడు ఎం శ్రీనివాసరావు, తె లంగాణ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ ర వీందర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ నారాయణరెడ్డి, సభ్యులు దుర్గయ్య, వీర భద్రా రావు, తదితరులు పాల్గొన్నారు.