రెబ్బెన, జనవరి 4 : గడ్చిరోలిలో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు రెఫరీలు ఎంపికైనట్లు తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గోలేటి గ్రామానికి చెందిన సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కుమ్మరి మల్లేశ్, ఆర్.శ్రీనివాసరెడ్డి, ఆర్,రామకృష్ణారెడ్డి జాతీయ స్థాయి పోటీలకు రెఫరీలుగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.
వీరిని ఉమ్మడి ఆదిలాబాద్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి, అధ్యక్షుడు నర్సింగం, సంయుక్త కార్యదర్శి ఎస్.తిరుపతి, టాగ్ ఆఫ్ వార్ సెక్రటరీ భాస్కర్, షార్ప్ స్టార్ బాల్ బ్యాడ్మింటన్ గోలేటి అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, కోశాధికారి శంకర్, సీనీయర్ క్రీడాకారులు లక్ష్మణ్, సాంబయ్య, సదానందం, లింగరెడ్డి, హరిలాల్, గుజ్జ మల్లేశ్, సతీశ్, తౌఫీక్, రెడ్డి సతీశ్, చిన్ని అభినందించారు.