మంచిర్యాలటౌన్, అక్టోబర్ 11 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను అమలు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డి మాండ్ చేసింది. ఈ మేరకు శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. బీసీ జాతీయ హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలకు అనేక హామీలిచ్చి విస్మరించిందన్నారు.
బీసీలను మభ్యపెట్టి మాయ చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్కు నిజంగా చిత్తశుద్ధి ఉం టే గవర్నర్పై ఒత్తిడి చేసి బిల్లుకు ఆమోదము ద్ర వేయించాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి యాభైసార్లు వెళ్లినప్పటికీ ఏ ఒక్కసారి కూడా బీసీ అంశాన్ని ప్రధాని దృష్టికిగాని, కేంద్ర మంత్రుల దృష్టికిగాని తీసుకెళ్లలేదన్నారు. జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, గజ్జెల్లి వెంకటయ్య, వేముల అశోక్, చెలిమెల అంజయ్య, రాగి రాజే, నిన్నెలా నర్సయ్య, చంద్రగిరి చంద్రమౌళి, కంపరి వేణుగోపాల్,కీర్తి భిక్షపతి, అంకం సతీశ్, శ్రీనివాస్, వడ్డే రాజమౌళి పాల్గొన్నారు.
చెన్నూర్లో బీసీ సంఘాల నిరసన ర్యాలీ
చెన్నూర్, అక్టోబర్ 11: బీసీ రిజర్వేషన్ల అమలును రెడ్డి జాగృతి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శనివారం చెన్నూర్ పట్టణంలో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. జలాల్ పెట్రోల్ పంపు నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం మహత్మా జ్యోతి బాఫూలే. సావిత్రీబాయి ఫూలే విగ్రహాలకు పూల మాలలు వేసి నిర్వహించారు. అనంతరం బీసీ ఐక్య వేదిక నా యకుడు సిద్ది రమేశ్ మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించే వరకూ ఐక్య కార్యచరణతో ఉద్యమిస్తామని తెలిపారు.