జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)ని విస్తరించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తున్నది. మొట్ట మొదటిసారిగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఫిబ్రవరి 5వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది. సభ నిర్వహణ బాధ్యతలను అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి అప్పగించింది. విప్ సుమన్, ఎమ్మెల్యే రామన్న, మాజీ ఎంపీ నగేశ్లతో కలిసి మంత్రి పక్షం రోజులుగా అక్కడే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తున్నారు. బంధువులు, స్నేహితులు, వ్యాపారులను కలిసి భారీగా తరలిరావాలని కోరుతున్నారు. కాగా.. మహారాష్ట్రవాసుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు, విశేష స్పందన లభిస్తున్నది.
నిర్మల్/ఆదిలాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమి తి(బీఆర్ఎస్) పార్టీని విస్తరించేందుకు మంత్రి అల్లో ల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన నాందేడ్ జిల్లాలో బీఆర్ఎస్ సభ నిర్వహించ తలపెట్టగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీని క్షేత్రస్థాయి నుంచి విస్తరించడానికి మహా రాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో గల సరిహద్దు గ్రామా ల్లో పర్యటిస్తున్నారు. ప్రధానంగా మంత్రికి సభా బాధ్యతలు అప్పగించగా.. పక్షం రోజుల నుంచి అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్రలోని అప్పారావ్పేట్, షివిని, ఇస్లాపూర్, హిమాయత్ నగ ర్,కీని, ధర్మాబాద్, కిన్వట్ గ్రామాల్లో పర్యటిస్తుం డగా ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభి స్తున్నది. స్థానిక ప్రజలను పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా పాత స్నేహితు లు, బంధువులను కలిసి పార్టీ విస్తరణ కార్యకలాపా ల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నారు. ఇప్ప టికే పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలి రావాలంటూ కోరుతున్నారు. జిల్లా సరిహద్దు గ్రా మాల నుంచి కూడా కనీసం 10 వేల మందిని సభ కు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికను గుణంగానే స్థానిక బీఆర్ఎస్ నాయకులకు జన సమీకరణ బాధ్యతలు అప్పగించారు. దీంతో స్థానిక నాయకులంతా మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామాల్లో నివసిస్తున్న తమ బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు, వ్యాపారులతో మంతనాలు జరుపుతూ బీఆర్ఎస్కు మద్దతు తెలపాలని, అలాగే నాందేడ్ బహిరంగ సభకు తరలిరావాలని కోరుతున్నారు. కాగా.. మహారాష్ట్రవాసుల నుంచి స్పందన ల భిస్తుం డడం బీఆర్ఎస్ వర్గాలకు ఉత్సా హాన్నిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలి సిందే. ధర్మాబాద్ పరిధిలో గల దాదాపు 20 మంది సర్పంచ్లు ఇటీవలే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని, సీఎం కేసీఆర్ను కూడా కలిసి విలీన ప్రతి పాదనను అంగీకరించాల్సిందిగా కోరారు. తెలం గాణవాసులు సంక్షేమ పథకాలు అనుభవిస్తూ సంతోషంగా ఉండడంతో తాము కూడా ఇదే రాష్ట్రంలో కలవాలని కోరుకుంటున్నామంటున్నారు. తాము తెలంగాణ రాష్ట్ర పౌరులమైతే సంక్షేమ పథకాలు అందుతా యని, మా గ్రామాలు అభివృద్ధి చెందు తాయని అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 5న నాందేడ్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఊరు ఊరంతా తరలి వస్తామంటూ ప్రకటిస్తు న్నారు. అలాగే తమ చుట్టూ పక్కల గ్రామాల్లో కూడా బహిరంగ సభకు సంబంధించి ప్రచారాన్ని నిర్వహిస్తు న్నా రు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన ముఖ్య మంత్రులతోపాటు జాతీయ స్థాయి నేతలు నాందే డ్ సభకు రానున్నందున కనీవినీ ఎరుగని రీతిలో సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి.
నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ పనులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదివారం పరిశీలించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆదిలాబాద్, బోధన్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్, మాజీ ఎంపీ నగేశ్ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. సభాస్థలి తోపాటు పార్కింగ్, బారికేడ్లు, ఇతర పనుల ప్రగతిని పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్తోపాటు జాతీయ స్థాయి నేతలు వస్తున్నందున ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సభా ప్రాంగణానికి చేరుకునే మార్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా చూడాలని కోరుతున్నారు.
నాందేడ్ జిల్లాలో ఫిబ్ర వరి 5వ తేదీన బీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభకు వెళ్తా. నాతోపాటు పెద్ద సంఖ్యలో జనాన్ని తీసుకెళ్తా. నాతోపాటు సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా సభకు వెళ్లాలని ఆసక్తిగా ఉన్నారు. నిన్ననే మా ఊరికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వచ్చారు. బీఆర్ఎస్ ఏర్పాటు అవసరాన్ని వివరించారు. షివినితోపాటు అప్పారావ్పేట్ గ్రామానికి చెందిన చాలా మంది బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
కదం గణేశ్ పాటిల్, షివిని, మహారాష్ట్ర