నస్పూర్, మార్చి 15 : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందించడం ద్వారా ప్రజలు పొందే సంతోషమే పాలకులకు నిజమైన ఆనందమని రా్రష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. ఉట్నూర్లోని కుమ్రం భీం భవన సముదాయంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు బదావత్ సంతోష్, వెంకటేశ్ దోత్రే, రాజర్షిషా, ఆశిష్ సంగ్వాన్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీలు జానకీ షర్మిళ, సురేశ్కుమార్, ఘోస్ ఆలం, అటవీ శాఖ అధికారులు శివ్ ఆశిష్ సింగ్, ప్రషత్బాజీరావు పాటిల్, అదనపు కలెక్టర్లు రాహుల్, దీపక్ తివారీ, ఫైజన్ అహ్మద్, దాసరి వేణు, శ్యామలాదేవి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేయాలన్నారు. పోలీసు అధికారులు ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజలకు అందేలా జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.