నిర్మల్ చైన్గేట్, మార్చి 30 : మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక పథకాలను రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా కొన్నిం టి కింద రుణాలు ఇస్తున్నది. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా లక్షలాది రూపాయలు మంజూరు చేస్తున్నది. వాటిలో రాయితీలు సైతం కల్పిస్తున్నది. పొదుపు సంఘాల ప్రగతిపై వివరాలు తెలుసుకోవడంతో పాటు పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం ‘లఖ్పతి దీదీ’ యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్లో మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న వివరాలు నమోదు చేస్తారు. నిర్మల్ జిల్లాలో గ్రామైక్య సంఘాల ద్వారా క్షేత్ర స్థాయిలో సిబ్బందికి ఇప్పటికే అవగాహన కల్పించారు. యాప్లో వివరాల నమోదు ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నది.
జాతీయ జీవనోపాధుల మిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ‘లఖ్పతి దీదీ’ యాప్ను తీసుకొచ్చింది. మహిళా సంఘాలు తీసుకున్న బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల వివరాలు, తీసుకున్న రుణాలతో ఏ మేరకు ప్రగతిలో ఉన్నాయి? ఆదాయ వివరా లు? ఈ యాప్లో నమోదు చేస్తారు. మహిళలు పొదు పు సంఘంలో చేరాక ఆర్థిక పరిస్థితుల్లో ఏమైనా మా ర్పులున్నాయా? ఎన్నిసార్లు రుణాలు తీసుకున్నారు? వాయిదాల చెల్లింపులు ఎలా ఉన్నాయి? తదితర వివరాలన్నీ ఈ యాప్లో నమోదు చేస్తారు. ఇందులో సమగ్ర సమాచారం ఉండడంతో ప్రభుత్వం ఉన్నతాధికారులకు పొదుపు సంఘాల అభ్యున్నతికి నిర్ణయాలు తీసుకునేందుకు సులభతరమవుతుంది.
లఖ్పతి దీదీ యాప్పై క్షేత్ర స్థాయిలో సిబ్బందికి ఇప్పటికే అవగాహన కల్పించాం. ఈ యాప్లో వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. యాప్లో గ్రూపునకు సంబంధించిన రుణాలు, ఇతర వివరాలు నమోదు చేయడంతో పారదర్శకత ఏర్పడుతుంది. దీంతో పాటు ఎప్పటికప్పుడు వివరాలు తెలుస్తాయి. యాప్లో సమగ్ర సమాచారం ఉండడంతో ఉన్నతాధికారులకు సంఘాల ప్రగతికి నిర్ణయాలు తీసుకోవడం సులభతరమవుతుంది.
– కే విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి, నిర్మల్