సారంగాపూర్, డిసెంబర్ 4 : తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఆలయాల గుట్టలో రూ.30 లక్షలతో రేణుక ఎల్లమ్మ, రూ.15లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీరప్ప ఆలయానికి ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పురాతన దేవాలయాలను ఆధునికీకరణ చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సుమారు 500లకు పైగా ఆలయాలకు నిధులు మంజూరు చేసి రూపురేఖలు మార్చారని చెప్పారు.
గత పాలకులు దేవాలయాలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తొమ్మిదేండ్లలో మంత్రి హయాంలో నిర్మల్ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, రానున్న కాలంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, సర్పంచ్ సుజాత, ఎంపీటీసీ సామల పద్మ, ఉపసర్పంచ్ దేవిముత్యం, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ డైరెక్టర్ లక్ష్మీనారాయణగౌడ్, నాయకులు దేవిశంకర్, హైమద్, నారాయణరెడ్డి, నర్సారెడ్డి, లస్మయ్య, నారాయణరెడ్డి, నర్సాగౌడ్, ప్రవీణ్గౌడ్, రమేశ్గౌడ్, నిఖిల్గౌడ్, భూషణ్గౌడ్, కురుమ కులస్తులు పాల్గొన్నారు.