రెబ్బెన, ఫిబ్రవరి 25 : గంగాపూర్ గ్రామ శివారులో కొలువైన బాలాజీ వేంకటేశ్వరస్వామి జాతర శుక్రవారం వైభవంగా ప్రారంభమై.. ఆదివారంతో ముసిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి వారికి మొక్కులు తీర్చుకొని వెనుదిరిగారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి-సోనేరావు దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు, ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో కుటుంబ సభ్యులంతా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధి పొందిన గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ జయరాం, సభ్యులు, ఈవో బాపురెడ్డి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.
రెబ్బెన సీఐ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రశేఖర్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీలు కోవ అరుణ, వేముర్ల సంతోశ్, ద్రుపతాబాయి, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొటు శ్రీధర్రెడ్డి, ఎంపీటీసీలు పెసరి మధునయ్య, సంగం శ్రీనివాస్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు చెన్న సోమశేఖర్, మాజీ సర్పంచ్ పందిర్ల వినోద, నాయకులు పల్లె రాజేశ్వర్రావు, వోల్వోజీ వెంకటేశం, జుమ్మిడి ఆనందరావు, పందిర్ల మధునయ్య, దుర్గం భరద్వాజ్, వినోద్జైస్వాల్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లావుడ్య రమేశ్, సభ్యులు లెంగుగురె గంటుమేర, మోడెం రాజాగౌడ్, బోంగు నర్సింగరావు, దుర్గం అన్నాజీ, చల్లూరి గంగయ్య ఉన్నారు.