జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 80 సీట్లకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుండగా, ఈ నెల 31తో గడువు ముగియనున్నది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల విద్యార్థులకు ఇందులో చేరేందుకు అవకాశమున్నది. ఏప్రిల్ 29న పరీక్ష ఉండగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నది.
కాగజ్నగర్, జనవరి 14: జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 31తో ముగియ నున్నది. 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఇప్పటికే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు మాత్రమే నవోదయ విద్యాలయంలో సీటు దక్కుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్గనర్ పట్టణంలో 198 7-88లో నవోదయ విద్యాలయం ప్రారంభించారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల నాలు గు జిల్లాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నవోదయ విద్యాలయంలో సీటు సాధించిన బాలబాలికలు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వేర్వేరుగా విద్యనభ్యసిస్తారు.
కాగజ్నగర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశం కోసం తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా ఉన్న జిల్లానే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా గతంలో 8 నుంచి 12 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు నవోదయ ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హులుగా ఉండేవారు. ఈ ఏడాది కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి తప్పనిసరిగా 11 నుంచి 12 ఏండ్లు నిండి ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులని అధికారులు చెబుతున్నారు.
కాగజ్నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 29న నిర్వహిస్తారు. జనవరి 1 నుంచి 31 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. గతంలో దరఖాస్తులు నింపి నేరుగా విద్యాలయంలో సమర్పించే వారు. 2015-16 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందులో ఉన్న 80 సీట్లకు వేల సంఖ్యలో దరఖాస్తులు రానున్నాయి. నాలుగు జిల్లాల్లో దాదాపుగా 36 కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష పారదర్శకంగా నిర్వహించడానికి కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు.
నవోదయ విద్యాలయాల్లో గతంలో తీవ్ర పోటీ ఉండేది. ఒక్కో సీటుకు 150 మంది విద్యార్థులకు పైగా పోటీ పడేవా రు. గతేడాది కేవలం 77 మంది విద్యార్థులే పోటీ పడ్డారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో పోటీ ఉంటుందని అంతా భావిస్తున్నారు. మన రాష్ట్రంలో మైనార్టీ గురుకులాలు, మహాత్మా జ్యోతి బాపూలే, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు, మోడల్ స్కూళ్లు నవోదయకు దీటుగా విద్యనందిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉండే ఈ స్కూళ్లను పిల్లలను చదివించేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో నవోదయ ప్రవేశాలకు పోటీ తగ్గిందని భావిస్తున్నారు.
నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహణ పారదర్శకంగా ఉంటుంది. విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష రాయడానికి విద్యార్థి ప్రస్తుతం 5వ తరగతి చదివుండాలి. విద్యార్థి 11 నుంచి 12 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి. అంతే కాకుండా తల్లిదండ్రులు ఇతర జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ అక్కడే నివాసముంటే ఇక్కడ అనర్హులుగా గుర్తిస్తారు. ఈ మార్పును విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి దరఖాస్తు చేసుకోవాలి. – చక్రపాణి, ప్రిన్సిపాల్, నవోదయ విద్యాలయం కాగజ్నగర్