జైనూర్ మే 1 : ఉపాధి హామీ పనుల్లో కూలీల హాజరు శాతం పెంచాలని గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్ అన్నారు. బుధవారం ఆమె జైనూర్ మండలంలో పర్యటించారు. జైనూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొకల నర్సరీని పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. ఆమె వెంట ఆసిఫాబాద్ డీఆర్డీవో సురేందర్, డీపీవో భిక్షపతిగౌడ్, ఎంపీడీవో ప్రభుదయ, ఈజీఎస్ ఏపీవో నగేశ్, ఐకేపీ ఏపీఎం సుజాత, ఈవో శ్రీనివాసరెడ్డి, సూపరింటెండెండ్ రాం చందర్, సీనియర్ అసిస్టెంట్ మోహన్, పంచాయతీరాజ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.