ఎదులాపురం: శాంతిభద్రతల పరిరక్షణలో సాయుధ బలగాలు అత్యంత కీలకమైనవని జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్లో మోటర్ ట్రాన్స్పోర్ట్ పరిపాలన, డాగ్ స్క్వాడ్ , బాంబు డిస్పోజల్ స్క్వాడ్, వాటర్ ప్లాంట్ , హోంగార్డ్, పోలీస్ స్టోర్ ఆయుధ బండారం తదితర విభాగాలను ఆయన తనిఖీలు చేశారు. దస్త్రాలు, పెండింగ్లో ఉన్న ఫైళ్లు , రిజిస్టర్లు, తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి విభాగాలు 5ఎస్ విధానంలోనే విధులు నిర్వహించాలని సూచించారు.
ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని, ఎలాంటి అసాంఘిక శక్తులు జిల్లాలో ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతంలో సాయుధ పోలీస్ బలగాలు నిరంతరం గాలింపులు చేపడుతుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి. వినోద్ కుమార్, ఏఆర్డీఎస్పీ ఎం. విజయ్ కుమార్, రిజర్వ్ సీఐ గడికొప్పుల వేణు, ఓ .సుధాకర్రావు, బి. శ్రీపాల్, వంశీకృష్ణ, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి పి. రమేశ్ తదితరులు పాల్గొన్నారు.