భైంసాటౌన్, మార్చి 4 : శారీరక, మానసిక రుగ్మతల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సం పూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో గ్రామీణుల ముంగిట యోగా శిక్షణ కేంద్రాలను ఏ ర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న కా లానుగుణంగా ఆహార నియమాల్లో మార్పుల కారణంగా ప్రజలు అతిచిన్న వయస్సులోనే డయాబెటిస్, బీపీ, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. వీటి నుంచి బయటపడాలంటే ప్రస్తుతం పాత పద్ధతిలో యోగా, ఇతర ఆసనాలతో వీటి నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో భాగంగా యోగా శిక్షణ కేం ద్రాలను ఆయుష్ శాఖ ఏర్పాటు చేస్తున్నది. వ్యాధుల బారిన పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై ప్రజలకు అవగాహ న కల్పించేలా ఆ శాఖ ప్రత్యేక దృష్టి సారించిం ది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో దవాఖానలకు వెళ్లకుండా ఇంటినే వైద్యశాలగా మార్చుకోవచ్చు. వివిధ రకాల దినుసులతో తయారు చేసిన మిశ్రమాలు, పెరట్లో లభించే ఔషధ మొక్కలతో వ్యాధులను ఎలా నయం చేసుకోవాలన్న విషయాలపై యోగా శిక్షణ కేంద్రాల్లో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
నిర్మల్ జిల్లాలో పది కేంద్రాలు..
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు పది యోగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో శిక్షణ కేం ద్రం ఏర్పాటు చేయడానికి రూ.6 లక్షలు కేటాయించారు. ఇందుకోసం మొత్తం రూ. 60 లక్ష లు వెచ్చించారు. గ్రామీణ ప్రాంతాలకు మొద టి ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలో నిర్మల్ జిల్లా ప్రధాన దవాఖానలో 2, కడ్తాల్, పొన్కల్, గుం డంపల్లి, కుంటాల, బాసర, తానూర్, పల్సి, దేగాం గ్రామాల్లో యోగా కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల చివరి దశలో ఉన్నా యి. త్వరలో యోగా కేంద్రాలను ప్రారంభించడానికి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఆయుష్ శాఖ ద్వారా యోగా విశిష్ఠత, కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. నిబంధనల మేరకు నిర్మాణాలు చేపడుతున్నారు.
సౌకర్యాలు ఇలా..
ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజలు మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఎలా ఉండాలో యోగా శిక్షకుడు తెలియజేస్తారు. శిక్షణ కేంద్రాల్లో షెడ్డు ఏర్పాటు చేసి వాటి చుట్టూ తులసి, కలబంద, పారిజాతం, రావి, మారేడు వంటి 15 రకాల మొక్కలు నాటనున్నారు. నిత్యం యోగా సాధనతో ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉండనున్నది.
శిక్షకులను నియమించగానే ప్రారంభం..
జిల్లాలో ఏర్పాటు చేసిన యోగా కేంద్రాల నిర్మాణాలు దాదాపు పూర్తి కావడంతో మరికొద్ది రోజుల్లో యోగాశిక్షకులను నియమించనున్నారు. అనంతరం యోగా సాధనను ప్రారంభిస్తారు. ఆయా కేంద్రాల్లో శిక్షణ అందించేందుకు వీలుగా అందుబాటులో ఉన్న శిక్షకుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్నది.