తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంచిర్యాల నియోజకవర్గంలో జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు.
మంచిర్యాలటౌన్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దివాకర్రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు హమాలీవాడ గేటు దగ్గర తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ‘జై తెలంగాణ ’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే దివాకర్రావు అక్కడే జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలన్న స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ప్రతి ఊరిలో హనుమాన్ ఆలయం ఉన్నట్లే ప్రతి ఇంటికీ కేసీఆర్ పథకాలు అందుతున్నాయని తెలిపారు.
అతి పిన్న వయస్సున్న రాష్ట్రం దేశంలో అద్భుతాలు సాధించి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, దీనంతటికీ కేసీఆర్ సుపరిపాలనే కారణమని అన్నారు. ఇలాంటి పాలన తమకు కూడా కావాలని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ దేశమంతా విస్తరిస్తున్నదని తెలిపారు. పదేళ్లలో మంచిర్యాల అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు. 20 రోజుల పాటు నిర్వహించే దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్చైర్మన్ ముఖేశ్గౌడ్, కౌన్సిలర్లు హరికృష్ణ, గాదెసత్యం, నల్ల శంకర్, ప్రకాశ్నాయక్, పోరెడ్డిరాజు, సుజాత, అంకం నరేశ్, మాదంశెట్టి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్, ఎంఈ మధూకర్, ఏఈ రాజేందర్, టీపీవో సత్యనారాయణ, మేనేజర్ విజయ్కుమార్, ఆర్వో శ్రీనివాస్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్ రాథోడ్, బీఆర్ఎస్ నాయకులు పల్లె భూమేశ్, గోగుల రవీందర్రెడ్డి, జాఫర్, బొలిశెట్టి కిషన్, ఎర్రం తిరుపతి, తాజుద్దీన్, రమేశ్, మల్లేశ్, గౌసొద్దీన్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎస్ఈ శేషారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈలు ఖైజర్, పెద్దిరా జం, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యమనేత.. అభివృద్ధి ప్రధాత సీఎం కేసీఆర్
సీసీసీ నస్పూర్, జూన్ 2: అనాటి ఉద్యమ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో కొట్లాడి రాష్ర్టాన్ని సాధించుకున్నట్లు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే దివాకర్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి మార్గనిర్ధేశంలో సింగరేణి సంస్థ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మంచిర్యాల జిల్లా ఏర్పాటు తర్వాత ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ సేవలందించడానికి సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారని, ఈనెల 9న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, నాయకులు వంగ తిరుపతి, రౌతు రజిత, పానుగంటి సత్తయ్య, కుర్మిల్ల అన్నపూర్ణ, కెడిక ప్రకాష్రెడ్డి, పంబాల గంగాఎర్రయ్య, చిడం మహేశ్, పెట్టం లక్ష్మణ్, జాబ్రిగౌస్, గర్శె భీమయ్య, జక్కుల రాజేశం, నాసర్, కాటం రాజు, దగ్గుల మధు, సంతోష్చారి, జక్కుల కుమార్, తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్లో
నస్పూర్లో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవరెడ్డి, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మెరుగు పవన్, మంద మల్లారెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి, వంగ తిరుపతి, రౌతు రజిత, పానుగంటి సత్తయ్య, కుర్మిల్ల అన్నపూర్ణ, కెడిక ప్రకాశ్రెడ్డి, పంబాల గంగా, చిడం మహేశ్, పెట్టం లక్ష్మణ్, జాబ్రిగౌస్, గర్శె భీమయ్య, జక్కుల రాజేశం, కాటం రాజు, దగ్గుల మధు, సంతోశ్చారి, సీపీఐ నాయకులు మిర్యాల రాజేశ్వర్రావు, జోగుల మల్లయ్య, లింగం రవి, దొడ్డిపట్ల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో..
గర్మిళ్ల, జూన్ 2: మంచిర్యాల జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా జడ్జి బీ సత్తయ్య, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్కుమార్, జూనియర్ సివిల్ జడ్జీలు అజయ్, ఉపనిషత్ ధ్వని, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు. డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో డీసీపీ సుధీర్ రామ్నాథ్ కెకన్, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వర్, డిప్యూటీ ఎమ్మార్వో కమల్ సింగ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీహరి, జూనియర్ అసిస్టెంట్ అంజయ్య, వీఆర్ఏలు లింగయ్య, రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. డీఈవో కార్యాలయంలో డీఈవో యాదయ్య ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అటవీ, వైద్య, రవాణా శాఖ కార్యాలయాల్లో..
మంచిర్యాల ఏసీసీ, జూన్ 2 : జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో డీఎఫ్వో శివ్ ఆశీష్ సింగ్, సూపరింటెండెంట్ భాస్కర్ రావు, టీవో రాములు, సీనియర్ అసిస్టెంట్ ప్రకాశ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో డీఎంహెచ్వో సుబ్బారాయుడు, ప్రోగ్రాం అధికారులు నీరజ, అనిత, సూపరింటెండెంట్ విశ్వేశ్వర రెడ్డి, డీపీవో ప్రశాంతి, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రవాణా శాఖాధికారి కార్యాలయంలో డీటీవో లెక్కల కిష్టయ్య, ఏవో, సీనియర్, జూనియర్ క్లర్క్లు, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో….
జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండాను రామడుగు లక్ష్మణ్ జిల్లా కార్యదర్శి ఆవిషరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఖలిందర్ ఆలి ఖాన్, మేకల దాసు, జోగుల మల్లయ్య, లింగం రవి, మిర్యాల రాజేశ్వరరావు, దేవి పొచన్న, మొగిలి లక్ష్మణ్, కాదండి సాంబయ్య, కొడి వెంకటేశ్, మోతె రాయలింగు, ఏగుడ మొండి, సారంగపాని పాల్గొన్నారు.
జన్నారంలో..
జన్నారం, జూన్ 2 : జన్నారం మండలంలో నిర్వహించిన వేడుకల్లో తహసీల్దార్ కిషన్, ఎంపీడీవో అరుణారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ సీపతి పద్మ, ఎంపీపీ మాదాడి సరోజన, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్అలీఖాన్, జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్ సిటిమల భరత్కుమార్, పొనకల్ సర్పంచ్ జక్కు భూమేశ్, ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్, కాంతమణి, ముత్యం సతీశ్, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులున్నారు.
దండేపల్లిలో..
దండేపల్లి, జూన్ 2 : దండేపల్లి మండలంలో నిర్వహించిన వేడుకల్లో తహసీల్దార్ హన్మంతరావు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, దండేపల్లి సర్పంచ్ చంద్రకళ, ఎస్ఐ ప్రసాద్, గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ఏవో అంజిత్కుమార్, సర్పంచ్లు జాతీయ జెండాలను ఎగురవేశారు. అనంతరం మిఠాయిలు పంచి పెట్టారు. గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో, తాళ్లపేట హనుమాన్ ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆయా గ్రామాల సర్పంచులు, తదితరులు ఉన్నారు.
హాజీపూర్లో..
హాజీపూర్, జూన్ 2 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించి గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నరేందర్, కార్యాలయ పరిపాలనాధికారులు సత్యనారాయణ, బాలకిషన్ రావు, శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణనాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) కార్యాలయంలో వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, టీఎన్జీవో ఫారెస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పొన్న మల్లయ్య, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. గుడిపేటలో పోలీసు బెటాలియన్లో ఇన్చార్జి కమాండెంట్ సురేశ్ జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ సిబ్బంది సాల్గొన్నారు. హాజీపూర్ మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత, తహసీల్దార్ రాజలింగు, జడ్పీటీసీ పూస్కూరి శిల్ప, ఎంపీడీవో అబ్దుల్ హై, ఎంపీవో శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.
కళాకారులకు ప్రశంసాపత్రాలు అందజేత
మంచిర్యాల ఏసీసీ, జూన్ 2 : కలెక్టరేట్ నిర్వహించిన వేడుకల్లో వివిధ కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాకారులకు ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్పర్సన్ ఎన్ భాగ్యలక్ష్మి, కలెక్టర్ బీ సంతోష్, అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమీ ప్రశంసా పత్రాలను అందింంచారు.
లక్షెట్టిపేట మండలంలో..
లక్షెట్టిపేట రూరల్ , జూన్ 2 : లక్షెట్టిపేటలో నిర్వహించిన వేడుకల్లో సీనియర్ సివిల్ జడ్జి అర్పితా రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి అసదుల్లా షరీఫ్, తహసీల్దార్ జ్యోత్న, సీఐ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సల్మాస్ కాంతయ్య, ఎంపీపీ అన్నం మంగ, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్, సర్పంచ్లు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.