తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. పలుచోట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైద్య రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి వివరించారు. ఉత్తమ సేవలందించిన వైద్యులు, సిబ్బందిని సన్మానించి అభినందించారు. పలువురికి కేసీఆర్, న్యూట్రిషన్ కిట్లతో పాటు చీరలు పంపిణీ చేశారు. ముగ్గుల పోటీలు ఆకట్టుకోగా, విద్యార్థులు, కళాకారులు ఆటాపాటలతో అలరించారు.
నిర్మల్ చైన్గేట్, జూన్,14 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్లో జరిగిన వేడుకలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంసీహెచ్లో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బాలింతలకు కేసీఆర్ కిట్లు అందించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యాధునిక వైద్యమందించేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. అనంతరం రక్తదానం చేసిన సామాజిక కార్యకర్తలను మంత్రి అభినందించారు. చిరుధాన్యాల స్టాల్ను పరిశీలించారు. వైద్య సిబ్బంది నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఖానాపూర్ టౌన్,జూన్14 : పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పాల్గొని గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల గురించి వివరించారు.
భైంసా, జూన్ 14 : పట్టణంలోని ఎన్ఆర్ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొని వైద్యులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు. న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు.
ఎదులాపురం, జూన్14 : జిల్లా కేంద్రంలోని జనార్దన్రెడ్డి గార్డెన్లో వైద్యారోగ్య దినోత్సవం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ జనార్దన్, కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. ఆశకార్యకర్తలకు చీరలు, రోగులకు ఎన్సీడీ కిట్లు, గర్భిణులకు న్యూట్రిషన్కిట్లు పంపిణీ చేశారు. వైద్య రంగం లో ప్రతిభ కనబరిచిన వారికి మెమొంటో అందజేసి శాలువాతో స త్కారించారు. కంటి వెలుగులో పరీక్షించుకున్న వారికి అద్దాలు అందజేశారు. అంగన్వాడీలకు చీరలు పంపిణీ చేశారు. ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. కళాకారులు ఆటాపాటలతో అలరించారు.
బోథ్, జూన్ 14 : బోథ్లోని స్వప్న జిన్నింగ్ మిల్ వద్ద నిర్వహించిన వేడుకల్లో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొని, సర్కారు అందిస్తున్న వైద్య సేవల గురించి అవగాహన కల్పించారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. వైద్యారోగ్యశాఖ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కంటి వెలుగులో పరీక్షించుకున్న వారికి అద్దాలు పంపిణీ చేశారు. అంగన్వాడీ ఆయాలకు చీరలు, బీపీ కిట్లను అందజేశారు.
బెల్లంపల్లి, జూన్ 14 : పట్టణంలోని పద్మశాలీభవన్లో వైద్యారోగ్య దినోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ పాల్గొన్నారు. గైనకాలజిస్ట్ కిరణ్మయితో పాటు వైద్యులు, సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. ఆశ కార్యకర్తలకు యూనిఫాం చీరలు పంపిణీ చేశారు. పలువురికి న్యూట్రిషన్, కేసీఆర్ కిట్లను అందించారు.
చెన్నూర్, జూన్ 14 : చెన్నూర్లోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ రాహుల్ పాల్గొని గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఉత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందించారు. డీఎంహెచ్వో సుబ్బారాయుడు, డిప్యూటీ డీఎంహెచ్వో విజయ నిర్మల ఉన్నారు.
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జూన్ 14 : జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సకు, కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామకృష్ణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, ఆరోగ్య కార్యకర్తలకు బీపీ ఆపరేటర్ మిషిన్లు, ఆశ కార్యకర్తలకు యూనిఫామ్లు, గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించారు.
కాగజ్నగర్, జూన్ 14: పట్టణంలోని సంతోష్ ఫంక్షన్ హాల్లో వైద్యారోగ్య దినోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి ఎమ్మెల్యే కోనప్ప, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.
మంచిర్యాల ఏసీసీ, జూన్ 14 : జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే దివాకర్ రావు, కలెక్టర్ బదావత్ సంతోష్, డీఎంహెచ్వో సుబ్బారాయుడుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వైద్యులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.